వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరై....నేడు విడుదల కానున్న సందర్భంగా ఆయన నివాసం లోటస్ పాండ్లో సందడి వాతావరణం నెలకొంది.
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరై....నేడు విడుదల కానున్న సందర్భంగా ఆయన నివాసం లోటస్ పాండ్లో సందడి వాతావరణం నెలకొంది. అభినందనలు తెలిపేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చినవారితో లోటస్ పాండ్ పరిసరాల్లో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. జగన్ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపేందుకు పార్టీ నాయకులు కూడా లోటస్ పాండ్కు తరలి వస్తున్నారు.