పోలీసుల భయంతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి | engineering student dies in fear of police | Sakshi
Sakshi News home page

పోలీసుల భయంతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

Mar 30 2014 11:00 AM | Updated on Nov 9 2018 4:36 PM

పోలీసులు వస్తున్నారన్న భయం.. ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. ఈ సంఘటన విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగింది.

పోలీసులు వస్తున్నారన్న భయం.. ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. ఈ సంఘటన విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగింది. నర్సీపట్నంలోని నేలబావిలో పడిపోయి చంద్రశేఖర్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. అయితే అతడి మృతికి మద్యం పార్టీయే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

శనివారం రాత్రి ఊరి చివర పొలాల్లో కొంతమంది యువకులు మందుపార్టీ చేసుకున్నారు. అయితే అక్కడకు పోలీసులు వస్తున్నట్లు సమాచారం అందడంతో వారు అరెస్టు చేస్తారన్న భయంతో యువకులంతా పరుగులు తీశారు. వారిలో చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. అలా పరుగు తీసేటప్పుడు చంద్రశేఖర్ చూసుకోకుండా నేలబావిలో పడిపోయి మరణించాడు.

Advertisement
 
Advertisement
Advertisement