‘భన్వర్‌లాల్‌పై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది’ | EAS Sharma Writes Letter to CEC, Seeking Action on AP Govt | Sakshi
Sakshi News home page

‘భన్వర్‌లాల్‌పై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది’

Nov 2 2017 12:37 PM | Updated on Jul 28 2018 3:41 PM

EAS Sharma Writes Letter to CEC, Seeking Action on AP Govt - Sakshi

సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఐఏఎస్‌ ఈఏఎస్‌ శర్మ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అచల్‌కుమార్‌ జ్యోతికి లేఖ రాశారు. నంద్యాల ఉప ఎన్నికలో నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకే భన్వర్‌లాల్‌పై ప్రభుత్వం కక్ష గట్టిందని అన్నారు. నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డబ్బు పంపిణీ అక్రమాలను కూడా భన్వర్‌లాల్‌ అడ్డుకున్నారని లేఖలో శర్మ చెప్పారు.

అందుకే ఆయన్ను ప్రభుత్వం టార్గెట్‌ చేసుకుందని తెలిపారు. భన్వర్‌లాల్‌ లాంటి నిజాయితీ గల అధికారులను కాపాడేందుకు ఇందులో కేంద్ర ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవాలని కోరారు. గతంలో బిహార్‌లో ఇలాగే జరిగినప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుందని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement