వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో ఎంసెట్: గంటా | EAMCET online from next year: Ganta | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో ఎంసెట్: గంటా

Apr 19 2016 1:46 AM | Updated on Sep 3 2017 10:11 PM

వచ్చే సంవత్సరం నుంచి ఎంసెట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.

సాక్షి, విజయవాడ బ్యూరో: వచ్చే సంవత్సరం నుంచి ఎంసెట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. అన్ని సెట్లు ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో 13 జిల్లాల ఎంసెట్ సమన్వయకర్తలు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఎంసెట్ పరీక్షల ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement