ప్రతి ఇంటినుంచి ఓ కళాకారుడు రావాలి | Each house should have an artist | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటినుంచి ఓ కళాకారుడు రావాలి

Dec 26 2016 1:08 AM | Updated on Aug 14 2018 11:26 AM

ప్రతి ఇంటినుంచి ఓ కళాకారుడు రావాలి - Sakshi

ప్రతి ఇంటినుంచి ఓ కళాకారుడు రావాలి

తెలుగునేల మీద ప్రతి ఇంటి నుంచి ఒక కూచిపూడి నృత్య కళాకారుడు రావాలని, అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం ఎన్‌.చంద్రబాబు చెప్పారు.

అందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
6,117 మంది కూచిపూడి నృత్యకళాకారులతో ఘనంగా మహాబృంద నాట్యం


విజయవాడ కల్చరల్‌: తెలుగునేల మీద ప్రతి ఇంటి నుంచి ఒక కూచిపూడి నృత్య కళాకారుడు రావాలని, అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం ఎన్‌.చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవా ల ముగింపు సభ, మహాబృంద నాట్య ప్రారంభ సభ ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో జరిగాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్‌కు అప్పగించామని తెలిపారు. అందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

కళలు జాతికి జీవనాడులని ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మహాబృంద నృత్యానికి దేశ విదేశాల నుంచి 6,117 మంది కూచిపూడి నృత్యకళాకారులు హాజరయ్యారు. జయము జయము గీతానికి అనుగుణంగా వారు నృత్యం చేశారు. 15 నిమిషాలపాటు ఈ నృత్యం కొనసాగింది. ఈ నృత్యాన్ని గిన్నిస్‌బుక్‌ ప్రతినిధులు అరుదైన ఫీట్‌గా గుర్తించారు. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులకు నాయకత్వం వహించిన రూపానాథ్‌ ఈ కార్యక్రమం ప్రపంచంలో రికార్డు సృష్టించిందంటూ.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులకు గిన్నిస్‌ బుక్‌ ధ్రువపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement