నెల్లూరు(క్రైమ్), న్యూస్లైన్ : జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తూ ఏళ్ల తరబడి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్న ఖైదీల నిరీక్షణ ఫలించింది. బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టి, కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో హాయిగా గడపాలనే వారి కల నెరవేరనుంది. రెండేళ్ల పాటు క్షమాభిక్ష జీఓ ఇదిగో, అదిగో అంటూ ఖైదీలను ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నెల 28న జీఓఎంఎస్ నంబర్ 220ను విడుదల చేసింది.
అక్టోబర్ 2వ తేదీ వరకు శిక్ష కాలాన్ని లెక్కించి మార్గదర్శకాల ప్రకారం విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను జైళ్ల శాఖ అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కేంద్ర కారాగార ఇన్చార్జి సూపరింటెండెంట్ ఎంఆర్ రవికరణ్ సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను తయారుచేసే పనిలో నిగమ్నమైయ్యారు. క్షమాభిక్ష జీఓ విడుదల కావడంతో జీవిత ఖైదీలు, వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. క్షమాభిక్ష జీఓ గతంలో నెల నుంచి రెండు నెలల ముందుగానే జిల్లా కేంద్ర కారాగారానికి అందేది. అధికారులు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను వెంటనే తయారుచేసి ఉన్నతాధికారులకు పంపేవారు. దీంతో జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2 గాంధీ జయంతి సంబరాల్లోనే క్షమాభిక్ష పొందిన ఖైదీలను విడుదల చేసేవారు.
ఈ సారి మాత్రం ప్రభుత్వం రెండు రోజుల ముందు జారీ చేయడంతో ఖైదీల విడుదల ప్రక్రియ ఆలస్యం కానుంది. అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్లో కాని ఖైదీలు విడుదల అయ్యే అవకాశం ఉంది. 2011 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర కారాగారం నుంచి క్షమాభిక్ష కింద 13 మంది జీవిత ఖైదీలు విడుదలయ్యారు. తాజాగా గాంధీజయంతి (ఖైదీల సంక్షేమ దినోత్సవం) సందర్భంగా జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా నూతన మార్గదర్శకాలను జారీచేసింది. జిల్లా కేంద్రకారాగారంలో 255 మంది జీవితఖైదు అనుభవిస్తుండగా, నూతన మార్గదర్శకాల ప్రకారం సత్ప్రవర్తన కలిగిన 27 మంది ఖైదీలు త్వరలో విడుదల కానున్నారు. ఇదిలా ఉంటే తాజా మార్గదర్శకాలు కొందరు ఖైదీల విడుదలకు ప్రతిబందకాలుగా మారాయి. దీంతో వారు ఆవేదన చెందుతున్నారు.
27 మంది విడుదల :
ఎంఆర్ రవికిరణ్, ఇన్చార్జి జైలు సూపరింటెండెంట్
ప్రభుత్వం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం 27 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు విడుదలయ్యే అవకాశం ఉంది. జాబితాను తయారు చేశాం. జాబితాను జైళ్లశాఖ ఉన్నతాధికారులకు ద్వారా ప్రభుత్వానికి పంపుతాము. జాబితాను ప్రభుత్వం ఆమోదించిన అనంతరం ఖైదీలను విడుదల చేస్తాం.
నిరీక్షణ ఫలించింది
Published Tue, Oct 1 2013 4:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement