సీబీఐ ఎదుట హాజరైన ధర్మాన | Dharmana Prasadarao attend CBI Enquiry | Sakshi
Sakshi News home page

సీబీఐ ఎదుట హాజరైన ధర్మాన

Aug 21 2013 11:03 AM | Updated on Sep 1 2017 9:59 PM

సీబీఐ ఎదుట హాజరైన ధర్మాన

సీబీఐ ఎదుట హాజరైన ధర్మాన

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు.

హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. దిల్కుశ అతిథిగృహంలో సీబీఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ ధర్మానకు సీఆర్పీపీ సెక్షన్ 160 కింద సీబీఐ నిన్న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

అనంతపురం జిల్లాలో ఇందూ కంపెనీకి సంబంధించి లేపాక్షి నాలెడ్జి ప్రాజెక్టుకు భూకేటాయింపుల వ్యవహారంలో ఆయనను సీబీఐ విచారిస్తోంది. కాగా ఇప్పటికే  ధర్మానపై సీబీఐ ఒక ఛార్జిషీట్ దాఖలు చేసింది. మూడోసారి ధర్మాన ప్రసాదరావు సీబీఐ ఎదుట హాజరయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement