విశాఖ మన్యంలో దట్టమైన పొగమంచు | dense fog in the Visakha manyam | Sakshi
Sakshi News home page

విశాఖ మన్యంలో దట్టమైన పొగమంచు

Jan 12 2016 8:15 AM | Updated on Apr 3 2019 9:27 PM

విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు మరోసారి తగ్గుముఖం పడుతున్నాయి.

విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు మరోసారి తగ్గుముఖం పడుతున్నాయి. మూడు రోజులుగా ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, చింతపల్లి, అరకు తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. లంబసింగిలో సోమవారం రాత్రి 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మోదకొండూరు, చింతపల్లి ప్రాంతాల్లో 8 డిగ్రీలు, పాడేరు, అరకులో ఉష్ణోగ్రత 9 డిగ్రీలుగా ఉంది. ఉదయం పది గంటల వరకూ మంచు కురుస్తూనే ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. పెరిగిన చలి తీవ్రతకు మన్యం వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement