విద్యార్థిని ప్రాణం తీసిన ఈవ్ టీజింగ్ | Degree Student Commit Suicide in Eluru | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ప్రాణం తీసిన ఈవ్ టీజింగ్

Aug 20 2014 5:21 PM | Updated on Nov 9 2018 4:36 PM

ఈవ్ టీజింగ్ ఓ విద్యార్థిని ప్రాణం తీసింది. ప్రేమ పేరుతో పెట్టిన వేధింపులు తట్టుకోలేక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో డిగ్రీ ఫస్టియర్ విద్యార్థిని ఒకరు ఆత్మహత్యకు పాల్పడింది.

ఏలూరు: ఈవ్ టీజింగ్ ఓ విద్యార్థిని ప్రాణం తీసింది. ప్రేమ పేరుతో పెట్టిన వేధింపులు తట్టుకోలేక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో డిగ్రీ ఫస్టియర్ విద్యార్థిని ఒకరు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది. సత్రంపాడు నెహ్రూ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికలంగా సంచలనం రేపింది.

ముగ్గురు యువకులు ఆమెను వేధిస్తుడడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. మృతురాలు సీఆర్ రెడ్డి కాలేజీలో చదువుతోంది. ఆమె తండ్రి కూడా అదే కాలేజీలో పనిచేస్తున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement