ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ శనివారం అనంతపురం జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. సీపీఐ బంద్కు
అనంతపురం : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ శనివారం అనంతపురం జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. సీపీఐ బంద్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే ఇంటర్మీడియెట్ పరీక్షల దృష్ట్యా విద్యాసంస్థలకు బంద్నుంచి మినహాయింపు లభించింది. మరోవైపు ఉరవకొండలో ఆర్టీసీ బస్సులను సీపీఐ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ దీక్ష చేపట్టిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్, ఇతర నాయకులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.