కారు, లారీ ఢీకొని దంపతుల మృతి | couple died and their kids injured in a road accident | Sakshi
Sakshi News home page

కారు, లారీ ఢీకొని దంపతుల మృతి

Jul 27 2015 7:56 AM | Updated on Jul 10 2019 7:55 PM

పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు.

గోపాలపురం: పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణంపాలెం గ్రామంలోని స్పీడ్ బ్రేకర్ దాటిన వెంటనే ఓ లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుకనే వస్తున్న కారు దాన్ని బలంగా ఢీకొంది.

కారులో ముందు భాగంలో ఉన్న దంపతులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో ఉన్న వారి ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరంతా రాజమండ్రి నగరానికి చెందిన వారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement