రైతు కుటుంబాలకు పరిహారం పెంపు | compensation increase for farmers families | Sakshi
Sakshi News home page

రైతు కుటుంబాలకు పరిహారం పెంపు

Mar 13 2015 1:07 PM | Updated on Aug 18 2018 8:54 PM

రైతు కుటుంబాలకు పరిహారం పెంపు - Sakshi

రైతు కుటుంబాలకు పరిహారం పెంపు

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది.

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. లక్షలోపు రుణాలకు వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు. ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను శుక్రవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు.

రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల లోపు రుణాలు పావలా వడ్డీ ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. పావలా వడ్డీ రుణాలకు రూ.10 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. మొదటి దశ రుణమాఫీకి 40.50 లక్షల ఖాతాలకు రూ.4,689 కోట్లు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. రెండో దశ కింద 42.16 లక్షల ఖాతాలకు రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement