విశాఖ ప్రమాదంపై నివేదిక అందజేత

Committee Report On Visakha Pharma Fire Incident - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్‌ కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌  వినయ్ చంద్ నియమించిన విచారణ కమిటీ నివేదిక అందజేసింది. ఐదుగురు సభ్యులతో కూడా కూడిన ఈ కమిటీ.. ప్రమాదంపై పూర్తి స్థాయిలో నివేదికను రూపొందించింది. ప్రమాదం జరిగిన తీరు ఆ తర్వాత  నెలకొన్న పరిణామాలపై రెండు పేజీల నివేదికను కలెక్టర్‌కు అందజేసింది. సాల్వెంట్‌ రికవరీ రియాక్టర్‌ వద్ద డై మిథైల్ సల్ఫాక్సైడ్ శుద్దిచేసే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా కమిటీ నివేదికలో పేర్కొంది. సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేయడంలో విఫలం కావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు కమిటీ సభ్యులు ప్రాథమికంగా అంచనా వేశారు.(విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం)

‘రాత్రి 9 గంటలకు షిఫ్ట్ మారే సమయంలో డై మిథైల్ సల్ఫాక్సైడ్ శుద్ధి కోసం  వేర్వేరు రసాయనాలు పంపించే  క్రమంలో కొంత అధికపీడనం నెలకొనడంతో అదుపుచేయడానికి కెమిస్ట్ మల్లేష్ ముందుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో కింది అంతస్తులో వచ్చిన స్పార్క్ తో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఆపరేటర్ శ్రీనివాస్ మృతి చెందారు’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు సాల్వెంట్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంపై పరవాడ పోలీస్‌ స్టేషన్‌లో 304/ఏ, 328 సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.(విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తే సహించం

శ్రీనివాసరావు కుటుంబానికి పరిహారం
విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్‌ ఫాక్టరీ జరిగిన ప్రమాదంలో మృతిచెందిన శ్రీనివాస్‌రావు కుటుంబానికి యజమాన్యం తరఫున రూ. 35 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 15 లక్షల పరిహారం అందజేయనున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మల్లేష్‌కు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top