కార్మికులకు సీఎం జగన్‌ మేడే శుభాకాంక్షలు 

CM YS Jagan Wishes To The All Workers On May Day - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. ప్రపంచ ప్రగతి, ఆర్ధిక వ్యవస్థ పురోగతి కార్మికుల స్వేదం, రక్తంతో పాటు వారి జీవితాలను ధారపోయడం వల్లే సాధ్యమవుతోంది. రేపు కార్మికుల పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులకు శుభాకాంక్షలు’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top