ఏలూరులో రేపు సీఎం జగన్‌ పర్యటన

CM YS Jagan To launch YSR Vahana Mitra at Eluru On Tomorrow - Sakshi

వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు  ఆయన ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి రూ.10 వేల చొప్పున వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద నగదు ప్రోత్సాహకాన్ని పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇండోర్ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు తదితరులు పర‍్యవేక్షించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top