సీఎం వ్యాఖ్యలపై న్యాయపోరాటం | CM comments A legal battle | Sakshi
Sakshi News home page

సీఎం వ్యాఖ్యలపై న్యాయపోరాటం

Feb 10 2016 2:18 AM | Updated on Sep 3 2017 5:17 PM

సీఎం వ్యాఖ్యలపై న్యాయపోరాటం

సీఎం వ్యాఖ్యలపై న్యాయపోరాటం

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబునాయుడు దళితులను అవమానపరిచేలా మాట్లాడడం సరికాదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని.........

 పుంగనూరు : ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబునాయుడు దళితులను అవమానపరిచేలా మాట్లాడడం సరికాదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, దళిత నేత ఎన్.రెడ్డెప్ప స్పష్టం చేశారు. హైకోర్టులో కేసు దాఖలు చేస్తామన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ‘దళితులుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు’ అంటూ మాట్లాడడం వారి మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అన్నారు. సమాజంలో దళితులు దుర్భరజీవితం గడుపుతున్నారని, వారిని ఆదుకోవాల్సింది పోయి అవహేళన చేయడం శోచనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ కులాలను అవమానపరచినా సహించేది లేదని ఈ సంద ర్భంగా రెడ్డెప్ప హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీపీలు నరసింహులు, అంజిబాబు, కౌన్సిలర్ మనోహర్, దళిత నాయకులు సురేష్, రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement