అధికారుల తీరుపై చంద్రబాబు ఫైర్ | CM Chandrababu naidu takes on Government officials | Sakshi
Sakshi News home page

అధికారుల తీరుపై చంద్రబాబు ఫైర్

Oct 18 2014 9:50 AM | Updated on Aug 18 2018 8:05 PM

అధికారుల తీరుపై చంద్రబాబు ఫైర్ - Sakshi

అధికారుల తీరుపై చంద్రబాబు ఫైర్

హుదూద్ తుపాను సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు అనుసరిస్తున్న అలసత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం: హుదూద్ తుపాను సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు అనుసరిస్తున్న అలసత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విశాఖలో సహాయక చర్యలపై చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ అంతంత మాత్రంగా జరుగుతుందని... పూర్తి స్థాయిలో రేషన్ పంపిణీ జరిగే విధంగా చూడాలని చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.

కూలీలు, వాహనాల కొరత తీవ్రంగా ఉందని... ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీ పూర్తి స్థాయిలో జరగాలంటే మరో 10 రోజులు పడుతుందని బాబుకు ఉన్నతాధికారులు బదులిచ్చారు. దీంతో అసంతృప్తి చెందిన బాబు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement