డెంగ్యూతో చిన్నారి మృత్యువాత


పర్చూరు: ప్రకాశం జిల్లాలో డెంగ్యూ జ్వరం విషమించడంతో చిన్నారి మృతిచెందింది. పర్చూరు మండలం నాగులపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


పావులూరుకు చెందిన సుధాజ్యోతి భర్త చనిపోవటంతో కూతురు తేజ(2)తో తల్లిగారింట్లో ఉంటోంది. 10 రోజుల క్రితం చిన్నారికి జ్వరం రావడంతో చీరాలలో చికిత్స అందించారు. తేజను మూడు రోజుల క్రితం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి చిన్నారి సోమవారం ఉదయం చనిపోయింది. ఇప్పటికే భర్త మరణించడంతో పాటు తాజాగా చిన్నారి మృతితో సుధాజ్యోతిని ఓదార్చడం ఎవరి వాళ్ల కావడం లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top