'కోటి 30 లక్షల మందికి చంద్రన్న కానుక' | Chandranna gifts distributed to crore 30 lakhs people, says Palle Raghunatha Reddy | Sakshi
Sakshi News home page

'కోటి 30 లక్షల మందికి చంద్రన్న కానుక'

Jan 14 2015 10:26 AM | Updated on Jul 28 2018 5:45 PM

రాష్ట్రంలో కోటి 30 లక్షల మందికి చంద్రన్న కానుకలు అందజేశామని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

తిరుమల: రాష్ట్రంలో కోటి 30 లక్షల మందికి చంద్రన్న కానుకలు అందజేశామని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. బుధవారం తిరుమలలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రన్న కానుకపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే... లబ్దిదారులను అవమాన పరిచనట్లే అని పల్లె వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఆయన తిరుమలలో కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.

సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ దుకాణం ద్వారా ఆరు రకాల సరుకులను 'చంద్రన్న కానుక' పేరిట టీడీపీ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement