రైతులకు క్షమాపణ చెప్పండి: నాగిరెడ్డి డిమాండ్ | chandrababu should apology for farmers, says mvs nagireddy | Sakshi
Sakshi News home page

రైతులకు క్షమాపణ చెప్పండి: నాగిరెడ్డి డిమాండ్

Nov 21 2014 7:29 PM | Updated on Jul 6 2019 12:58 PM

రైతులకు క్షమాపణ చెప్పండి: నాగిరెడ్డి డిమాండ్ - Sakshi

రైతులకు క్షమాపణ చెప్పండి: నాగిరెడ్డి డిమాండ్

పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు.

హైదరాబాద్: పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. వ్యవసాయ రుణాలు, పంటరుణాలు తేడా తెలియదా అని ప్రశ్నించారు. పొంతనలేకుండా మాట్లాడుతూ రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు తీరుతో రైతులు మానసిక సంఘర్షణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి, రైతులకు క్షమాపణ చెప్పాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement