
బాబు చైనా పర్యటనకు వస్తారు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం తప్పటడుగు వేసింది.
* బీజింగ్లో భారత దౌత్యాధికారికి లేఖ రాసిన సీఎం పేషీ
* కేంద్రం ద్వారా కోరాలంటూ తిప్పి పంపిన దౌత్యాధికారి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం తప్పటడుగు వేసింది. సీఎం చైనాలో పర్యటించాలనుకుంటున్నారని, అందుకు అనువైన కార్యక్రమాన్ని తెలియజేయాల్సిందిగా బీజింగ్లోని భారత దౌత్యాధికారికి నేరుగా సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి అజయ్సహాని లేఖ రాశారు. అయితే ఆ విధంగా లేఖ రాయడాన్ని బీజింగ్లోని భారత దౌత్యాధికారికి తప్పుబట్టారు. నేరుగా భారత దౌత్యాధికారికి లేఖ రాయకూడదని, తొలుత కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారానే చైనా పర్యటనకు ప్రయత్నించాలని భారత దౌత్యాధికారి స్పష్టం చేస్తూ తిరిగి సీఎం కార్యాలయానికి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.