కడప రూరల్: ఈనెల 27న (శుక్రవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారు. పర్యటన వివరాలను జిల్లా రెవెన్యూ అధికారి సులోచన బుధవారం వెల్లడించారు. ఆరోజు మధ్యాహ్నం 1.10 గంటలకు కర్నూలు నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి ఏరియల్ సర్వే ద్వారా గండికోట ప్రాజెక్టుకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారన్నారు. 2.05 నుంచి 3.00 గంటల వరకు గండికోట ప్రాజెక్టు దగ్గర రైతులతో ముఖాముఖి చర్చ, సమావేశంలో పాల్గొంటారన్నారు. 3.15 గంటలకు గండికోట ప్రాజెక్టు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి తిరుపతికి వెళతారన్నారు.
నేడు మంత్రి ఉమామహేశ్వరరావు రాక
రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నారని ఆమె తెలిపారు. ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు కడపలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని 10 గంటలకు గుర్రపు ట్యాంకు, సర్వరాయసాగర్, వామికొండ, గండికోట, జమ్మలమడుగును సందర్శిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మైలవరం డ్యాం టర్నల్ ఎగ్జిట్,ఆదినిమ్మాయపల్లె ఆయకట్టును పరిశీలించి ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గండికోట రిజర్వాయర్, పైడిపాలెం, సింహాద్రిపురం, ఎర్రబల్లె సందర్శించి పులివెందులకు చేరుకుంటారన్నారు. రాత్రి 8 గంటలకు పులివెందుల నుంచి ముద్దనూరుకు చేరుకుని రాత్రి 10 గంటలకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వెళతారన్నారు.
సీఎం పర్యటన విజయవంతం చేయండి
ఎర్రగుంట్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం గండికోట ప్రాజెక్ట్కు రానున్నారని సీఎం పర్యటను విజయవంతం చేయాలని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తెలిపారు.
బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు వామికొండ, గండికోట ప్రాజెక్ట్లు సందర్శిస్తారని కార్యకర్తలంతా పాల్గొనాలని కోరారు. తరువాత టీడీపీ జిల్లా నాయకుడు సురేష్నాయుడు మాట్లాడుతూ సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వెంకటశివారెడ్డి, తుపాకుల పవన్కుమార్రెడ్డి, ఎకెఎం శ్రీనివాసరెడ్డి, లాడ్జి అంకిరెడ్డి, సుంకరం నాగే శ్వరరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
రేపు జిల్లాకు సీఎం రాక
Published Thu, Feb 26 2015 2:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement