పేలిన సెల్‌ ఫోన్‌ | Cellphone Blast In Guntur | Sakshi
Sakshi News home page

పేలిన సెల్‌ ఫోన్‌

Oct 25 2018 1:29 PM | Updated on Oct 25 2018 1:29 PM

Cellphone Blast In Guntur - Sakshi

గుంటూరు, వి.రెడ్డిపాలెం (రొంపిచర్ల): మండలంలోని వి.రెడ్డిపాలెం గ్రామంలో సెల్‌ ఫోన్‌ పేలి మంటలు వచ్చిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి  నష్టం జరగలేదు.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఓ చోట అయ్యప్పస్వాములు, శివస్వాములు మధ్యాహ్నం వేళ సామూహిక చద్ది చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వి.హరిబాబు స్వామి సెల్‌ఫోన్‌ను చొక్కా జేబులో పెట్టి, దానిని పక్కనే ఉంచుకొని చద్ది చేస్తున్నాడు. 

కొద్దిసేపటికే చిన్న పాటి శబ్దం వచ్చింది.  చుట్టిన చొక్కాలోనుంచి మంటలు వచ్చాయి. అప్రమత్తమైన ఆ స్వామి చొక్కాను విధిలించటంతో ఫోన్, బ్యాటరీ వేరువేరుగా పడిపోయాయి. మంటలు ఆరిపోయాయి. 60 మంది స్వాముల మధ్యలో సెల్‌ఫోన్‌ పేలినా ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement