బోగస్ కార్డుల వ్యవహారంలో అధికారులపై చర్యలేవీ.. | Caryalevi officials to issue bogus cards .. | Sakshi
Sakshi News home page

బోగస్ కార్డుల వ్యవహారంలో అధికారులపై చర్యలేవీ..

Nov 3 2014 1:11 AM | Updated on Apr 3 2019 5:51 PM

గుడివాడలో వెలుగు చూసిన తెల్లరేషన్ కార్డుల వ్యవహారంలో ఇప్పటి వరకు డీలర్లపై మాత్రమే చర్యలు తీసుకున్నారు.

గుడివాడ : గుడివాడలో వెలుగు చూసిన తెల్లరేషన్ కార్డుల వ్యవహారంలో ఇప్పటి వరకు డీలర్లపై మాత్రమే చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధాలున్న అధికారులను విచారించి, వారిపై కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. ఒకరిద్దరు అధికారులపై కేసులు పెట్టి చేతులు దులుపుకునే పనిలో పోలీ సులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో 2005 నుంచి జరిగిన బోగస్ అవినీతిపై దర్యాప్తు చే యాల్సి ఉందని పట్టణ ప్రముఖులు పేర్కొంటున్నా రు. అధికారుల తరఫున ఒక వీఆర్వో, మరో డీటీపై కేసులు నమోదు చేసి వారి అరెస్టుతో సరిపెట్టేలా పోలీసుల విచారణ ఉన్నట్లు సమాచారం.
 
2005 నుంచి తెల్లరేషన్ కార్డుల్లో బోగస్‌వే...


పట్టణంలో 46మంది రేషన్ డీలర్ల వద్ద 15వేలకు పైగా 2005 లోనే బోగస్ కార్డులు ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అప్పట్లో పనిచేసిన పౌరసరఫరాల శాఖ డీటీ, తహశీల్దార్లు, వీఆర్వోలు ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బు తీసుకుని కార్డులు ఇచ్చినట్లు తెలిసింది. అనంతర కాలంలో 2008లో బోగస్ కార్డుల విచారణ చేయగా.. వాటిలో ఎనిమిది వేలకు పైగా బోగస్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించి తొలగించారు. ఆనాటి నుంచి ఉన్న బోగస్ కార్డులను కాపాడుకునే ప్రయత్నంలో రేషన్ డీలర్లు అడ్డదారులు తొక్కాల్సి వచ్చిందని చెబుతున్నారు.

అయితే ఈ బోగస్ కార్డుల వ్యవహారానికి ప్రధాన కారకులుగా ఉన్న అప్పటి అధికార యంత్రాంగం పాత్రపై విచారణ చేయటంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఒకరిద్దరు అధికారులపై కేసులు నమోదుచేసి సరిపుచ్చుకునే దిశగా విచారణ సాగుతోంది. ఒక కార్డు మంజూరు కావాలంటేఅందుకోసం అందిన దరఖాస్తును క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉంది. ఇందుకు రెవెన్యూశాఖలోని వీఆర్వోలు ఇతర అధికారులు ఉంటారు.

అనంతరం దానిని పౌరసరఫరాల శాఖ చూస్తున్న డీటీ బాధ్యత వహించి ఆయా మండల తహశీల్దార్‌లతో కార్డును మంజూరు చేయాల్సి ఉం ది. ఈ వ్యవహారంలో నలుగురికి మించి అధికారుల పాత్ర ఉంటుంది. దీన్ని బట్టి పట్టణంలో 46 రేషన్ దుకాణాల్లో బోగస్ కార్డులు ఉన్నట్లు గుర్తించటంతో అప్పటి వీఆర్వోలు నుంచి డీటీ, తహశీల్దార్‌లు అందరూ బాధ్యులేనని చెప్పాలి. దీనికి తోడు మం జూరైన కార్డులకు ఏటా కూపన్ల పంపిణీ జరుగుతుంది. ఇందుకోసం తహశీల్దార్ కార్యాలయం నుం చి కొందరు అధికారులను కేటాయించారు.

గ్రామం లో లేని వ్యక్తులు, చనిపోయిన వారి కార్డు లకు కూపన్లు పంపిణీ చేసినట్లు రాసిఇచ్చిన క్షేత్రస్థాయి అధికారుల పాత్ర ఉందనేది స్పష్టమవుతోంది. ఇటువంటి వారందరినీ విచారిస్తే బోగస్ కార్డుల అడ్డగోలు మంజూరు వ్యవహారంలో ఎవరెవరిపాత్ర ఎంతనేది తెలుస్తుంది. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న అధికారినే బాధ్యుడుగా చూపి కేసులు నమోదు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2005లో బోగస్ కార్డుల మంజూరుకు సహకరించిన అధికారి ఇప్పటికీ తమ వద్ద మామూళ్లు తీసుకుంటాడని డీలర్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో రేషన్ డీలర్లను అరెస్టు చేసిన అధికారులు..  సమగ్ర విచారణ జరిపి ప్రజాధనం లూటీకి పాల్పడటానికి వ్యూహరచన చేసి సహకరించిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
బోగస్ కార్డులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

కేవలం రేషన్ డీలర్లే నిందితులుగా చూపటం సరికాదు. ఇందుకు మొదటి నుంచి బోగస్ కార్డులకు ఆజ్యం పోసిన అధికారులందరూ బాధ్యులే, ఈ వ్యవహారంలో కింది నుంచి పైస్థాయి అధికారుల వరకు బోగస్‌కార్డుల బాగోతానికి సహకరించారు. విచారణాధికారిగా ఉన్న డీఎస్పీ నిష్పాక్షికంగా విచారణ జరిపి పూర్వాపరాలు పరిశీలించాలి. బోగస్ రేషన్ కార్డుల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయినందున అటువంటి అధికారులను విచారించి తగిన చర్యలు చేపట్టాలి. 2005లో వచ్చిన కార్డుల్లో బోగస్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని అధికారుల విచారణలో తేలడంతో వాటిని మంజూరు చేసిన అధికారులను విడిచి పెట్టటం తగదు.
 - చోరగుడి రవికాంత్, 24వ వార్డు కౌన్సిలర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement