'మతపరమైన జాతీయ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారు' | c ramachandraiah takes on narendra modi sarkar | Sakshi
Sakshi News home page

'మతపరమైన జాతీయ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారు'

Dec 15 2014 12:36 PM | Updated on Sep 4 2018 5:07 PM

'మతపరమైన జాతీయ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారు' - Sakshi

'మతపరమైన జాతీయ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారు'

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది.

హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. మతపరమైన జాతీయ వాదాన్ని మోదీ సర్కారు ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. సోమవారం ఇందిరాభవన్ లో పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి కార్యక్రమానికి పలువురు ఏపీసీసీ నేతలు హాజరై నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన రామచంద్రయ్య.. వివిధ సంస్థానాలుగా ఉన్న దేశాన్ని ఏకం చేసి లౌకితత్వాన్ని పట్టిష్టం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు.

 

కానీ మోదీ ప్రభుత్వం మాత్రం పటేల్ ఆశయస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ అజెండాను బీజేపీ అమలు చేయాలని యత్నిస్తోందని దుయ్యబట్టారు. దేశ సమగ్రతను కాపాడే విధంగా మోదీ సర్కారు వ్యవహరించాలని ఆయన సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement