'పుష్కరాల డబ్బు మేస్తే పాపం తగులుతుంది' | c. ramachandraiah takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'పుష్కరాల డబ్బు మేస్తే పాపం తగులుతుంది'

Jul 15 2015 4:53 PM | Updated on Sep 3 2017 5:33 AM

'పుష్కరాల డబ్బు మేస్తే పాపం తగులుతుంది'

'పుష్కరాల డబ్బు మేస్తే పాపం తగులుతుంది'

టీడీపీ నేతలు గనక పుష్కరాల డబ్బును మేసిఉంటే వారికి తప్పకుండా పాపం తగులుతుంది అని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం వేల కోట్లు ఖర్చుచేశామని టీడీపీ ప్రభుత్వం చెబుతున్న మాటల్లో ఏమాత్రం నిజంలేదని, క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుందని కాంగ్రెస్ పార్టీ నేత సి. రామచంద్రయ్య అన్నారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన పుష్కరాల కోసం కేటాయించిన నిధుల వినియోగంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

'ఒకవేళ టీడీపీ నేతలు గనక పుష్కరాల డబ్బును మేసిఉంటే వారికి తప్పకుండా పాపం తగులుతుంది' అని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. కేవలం కీర్త కోసమే చంద్రబాబు అంతాతానై వ్యవహరించాడని విమర్శించారు. సీఎం స్థాయిదాకాద ఎందుకు.. పుష్కరాల బాధ్యతను కలెక్టర్ కు అప్పగించిఉంటే సమర్థవంతంగా నిర్వహించేవారని ఎద్దేవాచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement