'నీటిమట్టాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నాం' | bottom of water projects maintained at level, says uma devineni | Sakshi
Sakshi News home page

'నీటిమట్టాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నాం'

Aug 16 2016 12:11 PM | Updated on Sep 4 2017 9:31 AM

'నీటిమట్టాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నాం'

'నీటిమట్టాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నాం'

అన్ని ప్రాజెక్టుల వద్ద నీటిమట్టాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు.

విజయవాడ: రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల వద్ద నీటిమట్టాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నామని ఏపీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 11.3 అడుగుల నీటి మట్టం ఉందని, బ్యారేజీ ద్వారా 15,110 క్యూసెక్కుల కృష్ణా జలాలను సాగు కోసం కాలువల ద్వారా విడుదల చేస్తున్నామని తెలిపారు. శ్రీశైలంలో నీటిమట్టం తక్కువగా ఉందని, ఐతే నీటి మట్టం ఇంకా పెంచాలని కొందరు బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ ద్వారా 7 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణకు తరలించామని, దానిని 80 టీఎంసీలకు పెంచాలన్నది సీఎం చంద్రబాబు కోరికని మంత్రి తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement