ఆళ్లగడ్డ ఎన్నిక ఏకగ్రీవం: ఆర్వో ప్రకటన | Sakshi
Sakshi News home page

ఆళ్లగడ్డ ఎన్నిక ఏకగ్రీవం: ఆర్వో ప్రకటన

Published Fri, Oct 24 2014 5:12 PM

ఆళ్లగడ్డ ఎన్నిక ఏకగ్రీవం: ఆర్వో ప్రకటన - Sakshi

ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శుక్రవారం మధ్యాహ్నం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఖిల ప్రియ ఎన్నిక లాంఛనప్రాయమైంది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 17న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ నామినేషన్ దాఖలు చేశారు.  ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement