శాంతాసిన్హాకు ‘బెగోరె’ అవార్డు ప్రదానం | Bezawada Gopala Reddy award for Shanta Sinha | Sakshi
Sakshi News home page

శాంతాసిన్హాకు ‘బెగోరె’ అవార్డు ప్రదానం

Aug 5 2013 4:20 AM | Updated on Sep 1 2017 9:38 PM

ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మశ్రీ శాంతాసిన్హాకు మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి స్మారక అవార్డును ఆదివారం నెల్లూరులోని పురమందిరంలో అందజేశారు.

 నెల్లూరు, న్యూస్‌లైన్ : ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మశ్రీ శాంతాసిన్హాకు మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి స్మారక అవార్డును ఆదివారం నెల్లూరులోని పురమందిరంలో అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సింహపురి ఆడపడచు శాంతాసిన్హాకు ఇలాంటి గొప్ప అవార్డును ప్రదానం చేయడం సింహపురికే గర్వకారణమన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు శాంతాసిన్హా చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అవార్డు గ్రహీత శాంతాసిన్హా మాట్లాడుతూ, తన జీవితంలో ఎన్నో అవార్డులను అందుకున్నానని, ఈ అవార్డు మాత్రం మనసుకు హత్తుకుందన్నారు. బెజవాడ గోపాల్‌రెడ్డితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అవార్డు ప్రదానం చేసిన వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement