ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిక్కచ్చిగా చెప్పినట్టు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిక్కచ్చిగా చెప్పినట్టు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తెలిపారు. తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డిని కలవడానికి మంగళవారం ఆయన తెలంగాణ అసెంబ్లీ లాబీల్లోకి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద డబ్బే లేదు. రైతుల రుణాలు మాఫీ ఎలా చేస్తారు? ’ అని జేసీ వ్యాఖ్యానించారు. ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ పనితీరు బాగుందన్నారు.