ఆర్టీసీ బస్సు పర్మిట్ల గడువు పెంపు | APSRTC deadline to raise the bus permits | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు పర్మిట్ల గడువు పెంపు

May 25 2014 2:35 AM | Updated on Sep 2 2017 7:48 AM

ఆర్టీసీ బస్సు పర్మిట్ల గడువు పెంపు

ఆర్టీసీ బస్సు పర్మిట్ల గడువు పెంపు

తెలంగాణ-సీమాంధ్ర ప్రాంతాల మధ్య తిరుగుతున్న రెండు ప్రాంతాల ఆర్టీసీ బస్సులకు ప్రస్తుతం ఉన్న పర్మిట్‌ను మరో ఏడాదికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 హైదరాబాద్: తెలంగాణ-సీమాంధ్ర ప్రాంతాల మధ్య తిరుగుతున్న రెండు ప్రాంతాల ఆర్టీసీ బస్సులకు ప్రస్తుతం ఉన్న పర్మిట్‌ను మరో ఏడాదికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి విభజన అధికారికం కానుండటంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల్లో సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీమాంధ్ర నుంచి తెలంగాణకు దాదాపు 2 వేలకుపైగా బస్సులు తిరుగుతుండగా, తెలంగాణ నుంచి సీమాంధ్రకు అందులో మూడోవంతు కూడా వెళ్లటం లేదు. దీంతో రెండు రాష్ట్రాలకు ఆ బస్సులను జనాభా నిష్పత్తి ఆధారంగా పంచాలనే విషయంలో వివాదం కొనసాగుతోంది.

జూన్ 2 నుంచి సీమాంధ్ర బస్సులను అడ్డుకుంటామని కొందరు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పర్మిట్లను మరో ఏడాది వరకు కొనసాగించొచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వు జారీ చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొలువు దీరిన తర్వాత పర్మిట్ల విషయంలో తీసుకునే నిర్ణయం ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని అందులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement