మాదిరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

APIIC Vice Chairman Met With An Auto Accident In Cycle Rally - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) వైస్ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్‌నకు తృటిలో ప్రమాదం తప్పింది. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం నగరం నుంచి అచ్యుతపురం వరకు ఆయన సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ర్యాలీ కొనసాగుతుండగా.. వడ్లపూడి వంతెనపై ప్రతాప్‌ సైకిల్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన చేతికి బలమైన గాయమైంది. దీంతో పోలీసులు ఆయనను గాజువాక లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం వైద్యులు విమ్స్‌కు తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top