'శివరామకృష్ణన్ కమిటీ నివేదికను బయటపెట్టాలి' | AP government should Disclose the Sivaramakrishnan committee report | Sakshi
Sakshi News home page

'శివరామకృష్ణన్ కమిటీ నివేదికను బయటపెట్టాలి'

Dec 6 2014 6:39 PM | Updated on Jun 2 2018 7:11 PM

'శివరామకృష్ణన్ కమిటీ నివేదికను బయటపెట్టాలి' - Sakshi

'శివరామకృష్ణన్ కమిటీ నివేదికను బయటపెట్టాలి'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను టీడీపీ ప్రభుత్వం బయటపెట్టాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను వెంటనే టీడీపీ ప్రభుత్వం బయట పెట్టాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... శివరామకృష్ణ కమిటీపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. అందుకు లక్ష ఎకరాలు అవసరం లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి 10 నుంచి 15వేల ఎకరాలు సరిపోతాయన్నారు.

 

చట్టబద్ధత లేని లాండ్ పూలింగ్ విధానంతో రైతులను బెదరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ సీపీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement