- ప్రయాణ మార్గంపై ఇంకా రాని స్పష్టత
- రెండు జోన్ల మధ్య సమన్యయ లోపం
- ఫలితంగా ఆలస్యమవుతున్న వైనం
- అంతా ఓకే అయితే సెప్టెంబర్లో కూత
విశాఖపట్నం సిటీః ఏపీ ఎక్స్ప్రెస్ను విశాఖ నుంచి నడిపేందుకు రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. దక్షిణ మధ్య రైల్వేకి ఈమేరకు బోర్డు నివేదించినట్లు తెలిసింది. అయితే విశాఖ నుంచి ఏ మార్గంలో నడపాలో స్పష్టత కొరవడింది. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు 18 నుంచి 20 గంటలు పడుతుంది. రాయగడ మీదుగా అయితే రెండు మూడు గంటల సమయం తగ్గుతుంది. విజయవాడ మీదుగా ప్రయాణిస్తే 20 గంటల సమయం తీసుకుంటుంది. విశాఖ నుంచి ఇప్పటికే నాలుగు రైళ్లు రాజధానికి నడుస్తున్నాయి. సమతా, హిరాకుడ్ ఎక్స్ప్రెస్లు రాయగడ మీదుగా నడుస్తున్నాయి. దక్షిణ్ లింక్, స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్లు విజయవాడ మీదుగా నడుస్తున్నాయి.
ఏపీ ఎక్స్ప్రెస్ కూడా తోడయితే అయిదు రైళ్లు అవుతాయి. ఇప్పుడు ఈ రైలు ఏ మార్గం గుండా బయల్దేరుతుందనేది సమస్యగా తయారైంది. 2014లో బడ్జెట్లో ప్రకటించిన ఈ రైలు ఎటు నడపాలో తెలియక ఆలస్యమవుతోందని రైల్వే వర్గాలంటున్నాయి. మార్గంపై స్పష్టత రాకపోవడం వెనుక దక్షిణ మధ్య, తూర్పు కోస్తా రైల్వేల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. విజయవాడ మీదుగా నడిపితే తూర్పు కోస్తా రైల్వేకు భారమవుతుంది. అందుకే రాయగడ మీదుగా నడిపేందుకు ప్రయత్నిస్తోంది. విజయవాడ మీదుగా నడిపితే నిర్వహణ విశాఖకే వస్తుంది. ఆదాయం మాత్రం దువ్వాడ వరకే అంటే 20 కిలోమీటర్లే ఉండడంతో ఆశించినంత ఆదాయం రాదని భావిస్తున్నట్టు తెలిసింది.
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా రైలును తూర్పు కోస్తాకే ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.ఎంపీ హరిబాబు ఈ రైలును విజయవాడ మీదుగా నడిపేందుకే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ భాగం కవరవుతుందనేది ఆయన వాదన.ఏమైనప్పటికీ రెండు జోన్ల మధ్య సమన్వయం కుదిరితే సెప్టెంబర్లో ఏపీ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కవచ్చంటున్నారు. ఆగస్టు ఆఖరి వారంలోనైనా ప్రారంభమయ్యే అవకాశముంది. రైల్వే టైం టేబుల్ పట్టికలో ఇంతవరకూ ఈ రైలుకు స్థానం కల్పించలేదు. వచ్చే సెప్టెంబర్లో విడుదలయ్యేపట్టికలో ఈ రైలు రాకపోకల వేళలు ప్రకటించే అవకాశాలున్నాయి. అప్పటికి గానీ ఈ రైలు ఏ మార్గంలో ఎన్ని గంటలకు ఎక్కడి నుంచి ఎక్కడికి బయల్దేరుతుందో తెలియదంటున్నారు.
ఏపీ ఎక్స్ప్రెస్ ఎటు?
Published Mon, Jul 27 2015 1:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement