ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు | AP Collectors Conference Starts in Vijayawada | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు

Sep 20 2017 11:47 AM | Updated on Sep 20 2017 11:53 AM

విజయవాడలో నేడు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది.

సాక్షి,అమరావతి: విజయవాడలో నేడు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో డిపార్ట్‌మెంట్లవారీగా ముఖ్యకార్యదర్శులు ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మాట్లాడారు. ప్రజలంతా ఏకపక్షంగా ఉన్నారని, ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే ఆరోపణలను వారు తిప్పికొట్టారని చెప్పారు. జలసిరికి హారతితో నదులకు హారతి ఇవ్వడం వినూత్న కార్యక్రమం అని తెలిపారు. 7 మిషన్లు, 5 గ్రిడ్లతో రాష్ట్రం అభివృద్ధిలో ఉందని, రెవెన్యూ శాఖలో సంస్కరణలతో ప్రజలకు చేరువయ్యామని అన్నారు.
 
విశాఖ భూ అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, సిట్ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తదనంతరం ఇది 13వ కలెక్టర్ల సదస్సు అని అన్నారు. రాష్ట్రంలో ఉత్పాదకత పెంపునకు, పారదర్శక పాలనకు ఉత్తమ అభ్యాసాలను అనుసరిస్తున్నామని వెల్లడించారు. రియల్ టైమ్ గవర్నెన్స్, ఇ-ప్రగతి, ప్రజలే ముందు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. కలెక్టర్లు రాత్రివేళల్లో గ్రామాల్లో నిద్రించాలని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement