ఢిల్లీ బయల్దేరి వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌

Ap Cm Ys Jagan Mohan Reddy Visit Delhi Today - Sakshi

రెండు రోజులపాటు పర్యటన

హోంమంత్రి అమిత్‌షా సహా పలువురు మంత్రులతో భేటీ

సాక్షి, అమరావతి : రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. 22న కూడా ఆయన ఢిల్లీలో ఉంటారు. ఇవాళ ఉదయం 10.05 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి  సీఎం ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం 2.05 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలపై ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని చర్చిస్తారు.  సీఎం సోమవారం రాత్రికి ఢిల్లీలోనే బసచేస్తారు. 22వ తేదీ మ.3.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ ఆయన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top