ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు.
త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం
Mar 4 2016 1:42 PM | Updated on Aug 24 2018 2:36 PM
నర్సరావుపేట : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన కోటప్పకొండలో త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటప్పకొండపై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోటప్పకొండ ఘాట్రోడ్డులో పకృతి పర్యావరణ కేంద్రాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అలాగే బ్రహ్మా, విష్ణు మూర్తి విగ్రహాలను ఆవిష్కరించి కాపు సత్రంలో కల్యాణ మండపాన్ని ప్రారంభించారు.
Advertisement
Advertisement