అళ్లగడ్డలో ముగిసిన అంత్యక్రియలు | Allagadda the end of the funeral | Sakshi
Sakshi News home page

అళ్లగడ్డలో ముగిసిన అంత్యక్రియలు

Dec 2 2014 5:44 AM | Updated on Sep 2 2017 5:30 PM

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తల్లి ఈశ్వరమ్మ(80) అనారోగ్యంతో సోమవా రం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తల్లి ఈశ్వరమ్మ(80) అనారోగ్యంతో సోమవా రం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అక్కడి నుంచి ఈశ్వరమ్మ పార్థివదే హాన్ని ఆళ్లగడ్డలోని భూమా స్వగృహా నికి తీసుకొచ్చారు. హైకోర్టు స్టే ఇచ్చిన తరువాత తల్లి మృతి వార్త తెలుసుకున్న భూమా ఆళ్లగడ్డకు చేరుకున్నారు.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ సర్పంచ్ ఎస్వీ నాగిరెడ్డి, ఎ.వి. సుబ్బారెడ్డి, తదితర ప్రముఖులు ఈశ్వరమ్మకు నివాళులర్పించారు. పట్టణంలోని శ్మశానవాటికలో ఈశ్వరమ్మ మృతదేహానికి భూమా నాగిరెడ్డి కర్మకాండ నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement