పెద్ద మనసు చాటుకున్న మంత్రి ఆదిమూలపు  | Adimulapu Suresh Helps A Couple Near Kotappakonda | Sakshi
Sakshi News home page

పెద్ద మనసు చాటుకున్న మంత్రి ఆదిమూలపు 

Jul 14 2019 2:32 PM | Updated on Jul 14 2019 5:41 PM

Adimulapu Suresh Helps A Couple Near Kotappakonda - Sakshi

సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పెద్ద మనసును చాటుకున్నారు. తను వెళ్తున్న దారిలో రోడ్డు ప్రమాదం జరగడం గమనించిన మంత్రి క్షతగాత్రులకు సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. కోటప్పకొండ సమీపంలో ఆదివారం బైక్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు గాయపడ్డారు. అయితే అటుగా వెళ్తున్న ఆదిమూలపు సురేశ్‌ ఈ ఘటనను గమనించి తన కాన్వాయ్‌ను ఆపారు. 108ని పలిపించడమే కాకుండా.. దగ్గరుండి దంపతులకు ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై మంత్రి స్పందించిన తీరును స్థానికులు అభినందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement