పంచాయితీరాజ్ డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు | acb rides in bhogapuram panchayat raj DE | Sakshi
Sakshi News home page

పంచాయితీరాజ్ డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

Aug 25 2015 10:42 AM | Updated on Aug 17 2018 12:56 PM

విజయనగరం జిల్లా భోగాపురంలో పంచాయతీరాజ్ డీఈ మల్లా వెంకట్రావు ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

అనకాపల్లి : విజయనగరం జిల్లా భోగాపురంలో పంచాయతీరాజ్ డీఈ మల్లా వెంకట్రావు ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మంగళవారం ఉదయం నుంచి జిల్లా ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉన్న ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు సాగిస్తున్నారు. ఇటీవల వెంకటకృష్ణాజీ అనే డీఈ ఇంటిపై ఏసీబీ దాడుల జరిపిన సందర్భంగా లభించిన డాక్యుమెంట్లలో వెంకట్రావు పేరు కూడా ఉండటంతో ఆ మేరకు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement