ఒంగోలు పీటీసీ డీఎ‍స్పీ ఇంటిపై ఏసీబీ దాడులు | ACB Raids on Ongole PTC DSP Durga Prasad houses | Sakshi
Sakshi News home page

ఒంగోలు పీటీసీ డీఎ‍స్పీ ఇంటిపై ఏసీబీ దాడులు

Jan 18 2017 10:10 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఒంగోలు పీటీసీ డీఎ‍స్పీ ఇంటిపై ఏసీబీ దాడులు - Sakshi

ఒంగోలు పీటీసీ డీఎ‍స్పీ ఇంటిపై ఏసీబీ దాడులు

ఒంగోలు పీటీసీ డీఎస్పీ ఇంటిపై అవినీతి నిరోధక శాఖాధికారులు మెరుపు దాడులకు దిగారు.

ప్రకాశం : ఒంగోలు పీటీసీ డీఎస్పీ దుర్గాప్రసాద్ ఇంటిపై బుధవారం అవినీతి నిరోధక శాఖాధికారులు మెరుపు దాడులకు దిగారు. గుంటూరు బ్రాడీపేటలోని దుర్గాప్రసాద్ నివాసంతో పాటు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్లలో ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. దుర్గాప్రసాద్ కొంతకాలంగా గుంటూరు నుంచే ఒంగోలు కార్యాలయ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. దుర్గాప్రసాద్ గతంలో పనిచేసిన ప్రాంతాల్లో కూడా భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

ఈ దాడుల సమాచారం తెలియగానే డీఎస్పీ బాధితులు సంబరాలు చేసుకున్నారు. దుర్గాప్రసాద్ ఇంటి ఎదుటే బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. డీఎస్పీ తమను అన్యాయంగా వేధించాడని బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement