రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీంలో పిల్‌

రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీంలో పిల్‌ - Sakshi


న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని  న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేశారు.  సుప్రీం కోర్టు దీనిని సోమవారం విచారించనుంది.



ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజనపై స్పష్టత కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఈరోజు ఒక  ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రంలోని ఇరుప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు.  పశ్చిమగోదావరి జిల్లాకు  చెందిన సూర్యనారాయణ ఈ  వ్యాజ్యం దాఖలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top