♦ విషగుళికలు కలిపిన నీరే కారణం
♦ రూ.7 లక్షలు నష్టం
♦ విలవిల్లాడిన పోషకులు
నాగెళ్లముడుపు (తర్లుపాడు) : విషగుళికలు కలిపిన నీరు తాగి 70 గొర్రెలు, 3 జింకలు మృతిచెందిన సంఘటన తర్లుపాడు మండలంలోని నాగెళ్లముడుపు ఇలాఖాలో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... నాగెళ్లముడుపు, ఉమ్మారెడ్డిపల్లె గ్రామాల వాసులైన నాగం గురవయ్య, వెంకటయ్య, రమణయ్య, మూడమంచు పోలయ్యలకు చెందిన సుమారు 300 గొర్రెలు, పొట్టేళ్లు నాగెళ్లముడుపు ట్యాంకు సమీపంలోకి మేత కోసం వచ్చాయి. ఆ సమీపంలోని మద్దసాని గురుమూర్తి బత్తాయి తోట వద్ద ఉన్న నీటి కుంటలోకి దాహం తీర్చుకునేందుకు వెళ్లాయి.
అయితే, ఆ తోట యజమాని.. బత్తాయి చెట్లను అడవి పందులు, జింకలు నాశనం చేస్తుండటంతో వాటిని అంతమొందించేందుకు సమీపంలో గుంతతీసి నీరు నింపి విషగుళికలు కలిపడంతో ఆ నీరు తాగిన గొర్రెలు కొద్దిసేపటికే గిలగిల్లాడుతూ అక్కడికక్కడే చనిపోయి కుప్పలుకుప్పలుగా పడ్డాయి. మరికొన్ని గొర్రెలు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. కంటికి రెప్పలా పెంచుకున్న గొర్రెలు తమ కళ్ల ముందే మృతి చెందడాన్ని బాధితులు జీర్ణించుకోలేక విలవిల్లాడారు. సమాచారం అందుకున్న పరిసర గ్రామాల ప్రజలు మృతిచెందిన గొర్రెలను చూసేందుకు భారీగా అక్కడకు తరలివచ్చారు.
బాధితులు విలపించిన తీరు చూపురులతో కంటతడి పెట్టించింది. ఈ విషయంపై తాడివారిపల్లె పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాగా, అదే విషపు నీరు తాగి మూడు జింకలు చనిపోయాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని చనిపోయిన జింకలను పరిశీలించారు. దీనిపై వారు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
70 గొర్రెలు, 3 జింకలు మృతి
Published Fri, Jul 10 2015 1:28 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement