అదృశ్యమైన బాలుడు శవమై తేలాడు | 5 years old boy suspicious death | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన బాలుడు శవమై తేలాడు

Oct 9 2015 6:23 PM | Updated on Jun 1 2018 8:36 PM

మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ బాలుడు అనంతపురం ఆరో రోడ్డు సమీపంలోని నడిమి వంక వద్ద శవమై కనిపించాడు.

అనంతపురం : మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ బాలుడు అనంతపురం ఆరో రోడ్డు సమీపంలోని నడిమి వంక వద్ద శవమై కనిపించాడు. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం ఆరో రోడ్డులో నివాసం ఉండే మహ్మద్ అస్మత్(5) మూడు రోజుల క్రితం రోజూలానే స్కూల్‌కు వెళ్లాడు. అయితే స్కూల్‌కు వెళ్లిన అస్మత్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు అస్మత్ ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. శుక్రవారం 4 గంటల సమయంలో నడిమివంక వద్ద చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరీక్షించిన అనంతరం 3 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు మహ్మద్ అస్మత్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement