కోతులను పట్టడం కోసం మున్సిపాలిటీ వారు పెట్టిన విషాహారం తిని ఐదుగురు విద్యార్థులు అస్వస్థత పాలైన ఘటన మంగళవారం గూడూరులో జరిగింది.
కోతులను పట్టడం కోసం మున్సిపాలిటీ వారు పెట్టిన విషాహారం తిని ఐదుగురు విద్యార్థులు అస్వస్థత పాలైన ఘటన మంగళవారం గూడూరులో జరిగింది. ఓజిలి అరుంధతీయ వాడలోని ప్రాథ మిక పాఠశాలకు సమీపంలో పడేసిన విషం కలిపిన అరటిపండ్లను ఐదుగురు చిన్నారులు తిన్నారు. అస్వస్థత పాలైన చిన్నారులను పాఠశాల నిర్వాహకులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.