కాకినాడ-సికింద్రాబాద్ మధ్య 4 ప్రత్యేక రైళ్లు | 4 Special Trains services between kakinada to Secunderabad | Sakshi
Sakshi News home page

కాకినాడ-సికింద్రాబాద్ మధ్య 4 ప్రత్యేక రైళ్లు

Aug 23 2013 6:31 AM | Updated on Sep 1 2017 10:03 PM

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-కాకినాడ (07101/07102) మధ్య కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్ల మీదుగా 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కే సాంబశివరావు గురువారం తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-కాకినాడ (07101/07102) మధ్య కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్ల మీదుగా 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కే సాంబశివరావు గురువారం  తెలిపారు. ఈ నెల 23న రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
 
 తిరుగు ప్రయాణంలో ఆగస్టు 24న సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మరో 2 రైళ్లు కాకినాడ-సికింద్రాబాద్ (07002/07001) మధ్య భీమవరం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్లగొండల మీదుగా నడవనున్నాయి. కాకినాడ నుంచి రైలు ఈ నెల 25 సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 26న రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.35 గంటలకు కాకినాడకు చేరుతుందని సీపీఆర్వో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement