ఎర్రచందనం అక్రమంగా తరలించేందుకు వస్తున్న 30 మంది కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చంద్రగిరి: ఎర్రచందనం అక్రమంగా తరలించేందుకు వస్తున్న 30 మంది కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గురువారం అర్థరాత్రి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జరిగింది. తమిళనాడుకు చెందిన 30 మంది కూలీలు ఆ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సులో చిత్తూరుకు వస్తున్నారు.
ఈ విషయాన్ని పోలీసులకు ఆగంతకులు ఫోన్లో సమాచారం అందించారు. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తమిళనాడు ఆర్టీసీ బస్సును సీజ్ చేసినట్లు సమాచారం.