30 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్ | 30 Red sandalwood labour arrested in chittoor district | Sakshi
Sakshi News home page

30 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్

Mar 13 2015 9:11 AM | Updated on Aug 20 2018 4:44 PM

ఎర్రచందనం అక్రమంగా తరలించేందుకు వస్తున్న 30 మంది కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చంద్రగిరి: ఎర్రచందనం అక్రమంగా తరలించేందుకు వస్తున్న 30 మంది కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ సంఘటన గురువారం అర్థరాత్రి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జరిగింది. తమిళనాడుకు చెందిన 30 మంది కూలీలు ఆ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సులో చిత్తూరుకు వస్తున్నారు.

ఈ విషయాన్ని పోలీసులకు ఆగంతకులు ఫోన్లో సమాచారం అందించారు. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తమిళనాడు ఆర్టీసీ బస్సును సీజ్ చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement