మూడేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
దత్తిరాజేరు (విజయనగరం) : మూడేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో గురువారం చోటుచేసుకుంది.
మండలంలోని ఇంగిలాపల్లి గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.