మొవ్వలో ఒకే రోజు ముగ్గురికి పాముకాట్లు
సాక్షి, కృష్ణా: జిల్లాలోని మొవ్వ మండలంలో పాములు కలకలం సృష్టించడంతో మంగళవారం ఒక్కరోజే ముగ్గురు పాముకాటుకి గురయ్యారు. మొవ్వలో ఈనెలలో ఇప్పటికే 30 పాముకాటు కేసులు నమోదయ్యాయి. పాముల బెడద స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మొవ్వ గవర్నమెంట్ హాస్పిటల్లో పాముకాటు బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని డాక్టర్ శొంఠి శివరామకృష్ణ అన్నారు. పాము కాటువేస్తే ఎటువంటి అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించుకోవాలని సూచించారు. మొవ్వ హాస్పిటల్లో పాముకాటు బాధితుల కోసం విరుగుడు ఔషధాన్ని(యాంటీ స్నేక్ వీనమ్) అందుబాటులో ఉంచామని తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాటు సమయంలో బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిమాణం ఆధారంగా కూడా ప్రమాదపు స్ధాయి ఉంటుందని తెలిపారు.