సాక్షి, విశాఖపట్నం :
అల్పపీడనం ప్రభావంతో పంటనష్టం తుది నివేదికను శుక్రవారం సాయంత్రం వ్యవసాయశాఖాధికారులు కలెక్టర్కు అందజేశారు. ఈ ఏడాది అక్టోబర్లో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 14,923 హెక్టార్లలో సుమారు రూ.29 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఎట్టకేలకు తేల్చారు. ఇందుకు 59,387 మంది రైతులకు రూ.13.85కోట్లు ఇన్ఫుట్ సబ్సిడీ చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఇంకా తొమ్మిది మండలాల్లో ఒకటి రెండు పంచాయతీల్లో లెక్కింపు పూర్తికాకపోవడంతో స్వల్ప మార్పులుండొచ్చని తెలిపారు. దీనిని కలెక్టర్ పరిశీలించాక ఇన్ఫుట్ సబ్సిడీ మంజూరు కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. అప్పట్లో భారీ వర్షాలకు జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు నీట మునిగాయి. 28,285హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేశారు
. క్షేత్రస్థాయిలో లెక్కింపు అనంతరం 34మండలాల్లోని 14,923 హెక్టార్లలో మాత్రమే వాస్తవంగా నష్టం ఉన్నట్టు నిర్ధారించారు. 50 శాతం లోపు నష్టపోయిన పంటను, అంతర పంటల్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో ప్రాథమిక అంచనాలో నష్టం దాదాపు సగానికి పైగా తగ్గిపోయింది. రైతులు వాస్తవంగా రూ.54.57కోట్లు నష్టపోయినా ఇన్ఫుట్ సబ్సిడీగా ప్రభుత్వమిచ్చేది కేవలం రూ.13.85 కోట్లు మాత్రమే. వరి, వేరుశనగ,పత్తి, చెరకు పంటలకు హెక్టార్కు రూ.10వేలు చొప్పున, మిగతా పంటలకు హెక్టార్కు రూ.6,250 చొప్పున లెక్క కట్టారు. ఈ లెక్కన జిల్లాలో 59,387మంది రైతులు పరిహారం పొందడానికి అర్హులని తేల్చారు.
పంట నష్టం రూ.29 కోట్లు
Published Sat, Dec 14 2013 4:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement